రాజు- మంచి బాలుడు
దుప్పెల్లి
ఊరిలొ రాజు వారి తాత గారితో కలసి నివసిస్తున్నాడు,రాజు చాలా బదకస్తుడు తాత
గారి మాట వినేవాడు కాదు బడికి కూడా సరిగా పొడు కాని భక్తి దేవుడి పై
నమ్మకం ఎక్కువ. తాత గారు రాజుని చుాసి వీడు ఎప్పుడు బాగు పడుతాడురా అని
విచారించేవాడు. రాజు మృధుస్వభావి .పని మరియు చదువు పై మక్కువ లేదు. సోమరి
తనానికి తాత చింతిచేవాడు
తాత
మంచి కళకారుడు యక్షగానం కొట్టిన పిండి,మంచి కంఠంతొ నలుగురికినాలుక లాగా
ఉండేవాడు. రాజు తాత గారిని దేవుడిపై చాలా విషయాలు అడిగేవాడు
సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణువు ,శంకరుడాని చెప్పేవాడు.
రాజు చాల శ్రద్ధతొ వినేవాడు
ఒకరొజు
రాజు నిద్రిస్తున సమయంలో కలలొ మెుదట శివుడు కనిపించాడు రాజు అనందంతొ దేవా
నాకు చాలా ధనం కావాలి పని చెయకుండా జీవించాలి అన్నా డు దానికి శివుడు రాజు
నేనే తొలు కట్టుకొని ఇల్లు లేకుండ వున్నాను నీకేమి ఇవలేను అని మాయం అయాడు.
తరువాత బ్రహ్మదేవుడు అదే తంతు .చదువు కావాలంటే. వద్దులే అన్నాడు రాజు.
చివరకు
విష్ణువు కనిపించాడు, రాజు ధనం అంతా లక్ష్మీ దేవి కాడనే వుంది నేనే దేశాలు
తిరుగుతూ వుంటాను. ఈమాట విన రాజుకు కొపం తొ మీరు శిలలైదురుగక అన్నాడు
అంతలొ మెలకువ వచ్చింది. "కష్టపడకుండ ఎది రాదు కష్టపడితే వచ్చేది ఎప్పుటికిపొదు "
అనుకొని బుద్ధిగా చదువుకొని తాత పేరు నిలబెట్టాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి